నవాబుపేట వాగు ఇసుక తరలింపు అనుమతిని ప్రభుత్వం రద్దుచేయాలి....

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని నవాబుపేట మోయతుమ్మెద వాగు ఇసుకను  గౌరెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. వాగు నుండి ఇసుక తరలిస్తే... గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం గ్రామంలోని కొందరు రైతులు ఇసుక తరలింపునకు నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు. సమాచారం అందుకున్న చిగురుమామిడి ఎసై దాస సుధాకర్ పోలీసు సిబ్బందితో దీక్షా స్థలానికి చేరుకుని, నిరాహారదీక్ష చేస్తున్న రైతులను పోలీసు స్టేషన్ కు తరలించారు. స్టేషన్ కు తరలించిన వారిలో  పిల్లి తిరుపతి, ఠాగూరు రణప్రతాప్, నరేందర్ సింగ్, బుర్ర శ్రీనివాస్, బోయిని వంశీకృష్ణ, ప్రశాంత్, మంద దేవేందర్  ఉన్నారు.