ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు....

ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు....

ముద్ర,సెంట్రల్ డెస్క్:-అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని లేడీ కర్జన్ ఆస్పత్రిలో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన కర్ణాటకలోని హస్సన్ పార్లమెంటు సభ్యుడు. కొద్దిసేపట్లో ప్రత్యేక ఆయనను  సిట్ కోర్టులో హాజరుపర్చనుంది. అనంతరం ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీకి అప్పగించాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది.  భవానీ రేవణ్ణను  రేపు ఆమె ఇంట్లోనే సిట్ ప్రశ్నించనున్నది. ప్రజ్వల్ రేవణ్ణను తరలించే వాహనంలో లేడీ ఎస్కార్ట్స్ ను ఏర్పాటు చేశారు. మహిళా భద్రతకు ఢోకా లేదని చెప్పడానికే ప్రజ్వల్ చుట్టూ మహిళా ఆఫీసర్లను పెట్టామని సిట్ పేర్కొన్నది.