మరోసారి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు...

మరోసారి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబయి వెళ్తున్న విమానం ముంబయి లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్నది. ఈ క్రమంలో బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రొటోకాల్‌ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్‌ బేకు తరలించి తనిఖీలు చేస్తున్నారు.

‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉన్నది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్‌ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్‌ ప్రకటించింది. కాగా, వారం రోజుల వ్యవధిలోఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి.