గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- లండన్ టూర్ ముగించుకొని ఏపీకి తిరిగివచ్చిన సీఎం జగన్ కు పార్టీ నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్ కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు నుండి జగన్ రాజకీయాలతో బిజీ కాబోతున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై నేతలతో చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు.