10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్కు ఆహ్వానం...
![10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్కు ఆహ్వానం...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665addd38962a.jpg)
ముద్ర,తెలంగాణ:-తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్కు సీఎం, డిప్యూటీ సీఎం పూల బోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.