స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పట్ల సంబరాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పట్ల సంబరాలు

ముద్ర,పానుగల్: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందడం పట్ల పానుగల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బానసంచ పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అమలు చెయ్యకుండా  ప్రజలను మోసం చేసిందన్నారు.

ప్రజా,రైతు సంక్షేమం బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ ప్యాట బాలరాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథ నాయుడు,భాస్కర్ రెడ్డి,రామచందర్ రావు, ధర్మారెడ్డి,బాలవర్దన్,రవి కుమార్ రెడ్డి,నవీన్ రెడ్డి,ఆది హనుమంతు,గోపాల్,తదితరులు పాల్గొన్నారు