తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : సోనియా గాంధీ
![తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : సోనియా గాంధీ](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665c2e7d10aee.jpg)
ముద్ర,తెలంగాణ:- ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తామని పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. ఈ వీడియోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు.