విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం...
  • ప్రమాదకరమని తెలిసిన అధికారులు పట్టించుకోరా
  • మంథని-ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై ప్రమాద కరంగా విద్యుత్ పోల్

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి:-విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు నిజంగానే శాపంగా మారిందా అనిపిస్తుంది.  ప్రమాదమని తెలిసిన ట్రాన్స్ కో అధికారులు పట్టించుకోరా...అని  మంథని, ముత్తారం మండల అధికారులను ప్రశ్నిస్తున్నారు. మంథని పట్టణం నుంచి ముత్తారం మండలం ఖమ్మంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి గద్దెలపల్లి గ్రామ సమీపంలో లెవెన్ కె.వి విద్యుత్  లైన్ ఫోల్  ఒరిగి ప్రమాదకరంగా కనిపిస్తున్న అధికారులకు మాత్రం కనిపిస్త లేదని ఇక్కడి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోల్ పడిపోతే వైర్లు తెగి ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించుకోవచ్చని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం రైతులకు శాపంగానే కనబడుతుందన్నారు. వెంటనే విద్యుత్ ఫోల్ మార్చి విద్యుత్ లైన్ మరమత్తులు  చేయాలని రైతుల ప్రజలు ట్రాన్స్కో అధికారులను కోరుతున్నారు.