డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి
  • సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి గ్రామంలో మురుకునీరు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని భీమనపల్లి - కనుముకుల గ్రామాల మధ్య గల రోడ్డును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో భయంకరమైన దుర్వాసన వస్తుందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యబారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, మంచాల మధు, నాయకులు కలుకూరి బిక్షపతి, నెలకంటి జంగయ్య, బూరుగు బిక్షపతి, పురుషోత్తం రెడ్డి, జంగారెడ్డి ,మల్లేష్, పాండురంగారెడ్డి, బిక్షపతి జనార్ధన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.