ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో ఎన్టీఆర్ మహాజన సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు, రోగులకు, గర్భిణీలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గునిగంటి మల్లేష్ గౌడ్, పోతగల్ల దానయ్య, రామిడి జంగారెడ్డి, ఇబ్రహీంపట్నం అంజయ్య, చేరాల నరసింహ, భారత భూషణ్ ,వలందాసు బక్కయ్య, పగడాల సత్యనారాయణ, సీత కృష్ణ, బైరు లక్ష్మయ్య, జానకిరామ్, భారత గిరిదాసు, సీత సత్యనారాయణ ,సీత నర్సింహ, భోగ రఘు, కొండమడుగు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.