బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాహుల్ గౌడ్

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాహుల్ గౌడ్

ముద్ర ప్రతినిధి భువనగిరి :కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి  సుమారు 200 మంది తన క్యాడరుతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బి.అర్.ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మాజీ సింగిల్విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆబ్బగాని వెంకట్ గౌడ్, జేక్క రాఘవేందర్ రెడ్డి, ర్యకేల శ్రీనివాస్, గోదా శ్రీను, గోదా నరేందర్, చిన్నం శ్రీను, తదితర నాయకులు పాల్గొన్నారు.