బీసీల అభ్యున్నతే బిఆర్ఎస్ ధ్యేయం....

బీసీల అభ్యున్నతే బిఆర్ఎస్ ధ్యేయం....

 ప్రభుత్వ విప్ గొంగిడి వెల్లడి.....

ఆలేరు (ముద్ర న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని బిసి ఉప కులాల అభ్యున్నతే బిఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయం అని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వై ఎస్ ఎన్ గార్డెన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బీసీ. ఎంబిసీ కులాలకు ఆర్థిక సహాయం కింద మంజూరు చేసిన చెక్కులను ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యాంక్ చైర్మన్ మరియు రాష్ట్ర అపెక్స్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ లతో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా మూడవసారి కెసిఆర్ కు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. వివిధ శాఖల అధికారులు. తదితరులు పాల్గొన్నారు.