కొమురయ్య మరణం విప్లవోద్యమానికి తీరని లోటు..

కొమురయ్య మరణం విప్లవోద్యమానికి తీరని లోటు..
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బిక్షపతి వెల్లడి..

ఆలేరు (ముద్ర న్యూస్):సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉద్యమ అభిమాని గోధుమకుంట కొమురయ్య మరణం విప్లవ ఉద్యమానికి తీరని లోటు అని కీర్తి రెడ్డి జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలోని కొమరయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కొమరయ్య తన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేయడంలో భాగంగా సిపిఐ ఎంఎల్ మీది మృతి పక్షాన నిలబడుతూ ప్రజాసంస్థల పరిష్కారం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం విప్లవజమానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ శ్రేణులు నిరంతరం పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి. నాయకులు కళ్లెపు అడుగయ్య. ఇక్కిరి సహదేవ్. మామిడాల బాల మల్లేష్. కూకట్ల బిక్షపతి. కట్ట రామ్ రెడ్డి. ఎలగందుల సిద్దులతోపాటు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు. సానుభూతిపరులు. కొమురయ్య కుటుంబ సభ్యులు. బంధుమిత్రులు. తదితరులు పాల్గొన్నారు.