డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

వలిగొండ : డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం  చేసుకోవాలని స్థానిక ఎంపిపి నూతి రమేష్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలో కుంభం ప్రేమలత శ్రీనివాస్ రెడ్డి సాంఘిక సంక్షేమ సేవాసమితి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సౌజన్యంతో మండలంలోని డ్రైవింగ్ లైసెన్స్ లేని 10 వేళా మంది యువతకు లైసెన్స్ లు ఇప్పించుటకు సదుద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తి రెడ్డి, బోళ్ల శ్రీనివాస్ , కంకల  కిష్టయ్య,కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్ , పల్లేర్ల రాజు, పాలకుర వెంకటేష్, బైరు సైదులు, బత్తిని సైదులు,మైసోల్ల ప్రవీణ్, ఎమ్మె మల్లేశo తదితరులు పాల్గొన్నారు.