జూనియర్ పంచాయతి కార్యదర్శిల రెగ్యులర్ లో భాగంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

జూనియర్ పంచాయతి కార్యదర్శిల రెగ్యులర్ లో భాగంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కోదురుపాక, వెంకట్రావుపల్లి, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, రామన్నపేట, మల్కాపూర్, అనంతపల్లి, భూరుగుపల్లి మరియు స్తంభంపల్లి గ్రామాలను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సత్య ప్రసాద్, జిల్లా ఫారెస్ట్ అధికారి బాలమణి మరియు రాజన్న సిరిసిల్ల అదడిషినల్ యస్పి లు సందర్శిoచినారు. సంభంధిత 9 మంది జూనియర్ పంచాయతి కార్యదర్శిల రెగ్యులర్ చేయడానికి పారా మీటర్ లో భాగంగా డంపింగ్ యార్డులు, స్మాశాన వాటికలు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు,తెలంగాణ క్రీడా ప్రాంగణములు మరియు వివిధ రకాల రిజిస్టర్స్ తనిఖీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బోయినిపల్లి ఎంపిడిఓ, యంపిఓలు తదితరులు ఉన్నారు.