పోడు భూముల సమస్య పరిష్కరించాలి

పోడు భూముల సమస్య పరిష్కరించాలి
  • పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరికీ న్యాయం చేయాలి
  • జడ్పీ చైర్మన్ కలిసిన కోనరావుపేట గిరిజనులు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించాలని త్వరలో ప్రభుత్వం పంపిణీ చేయనున్న పట్టాలలో మిస్సయిన వారి పేరు చేర్చాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డికి కొనరావుపేట మండలం గిరిజనులు వినతిపత్రం సమర్పించారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం సర్వే నిర్వహించిందని వినతి పత్రాల ప్రకారం జై సేవాలాల్ తండా ఊరిలో.. 112 మంది దరఖాస్తు చేయగా.. 66 మందికే సర్వేలు ఓకే చేశారని పేర్కొన్నారు. ఆరుగురు అందరికీ పోడు భూముల పట్టాలు ఇవ్వాలని కోరారు. తమకు న్యాయం చేయాలని జై సేవాలాల్ తండా గిరిజనులు కోరారు.