విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు

విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు
  • పాల్గొన్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట:విద్యార్థిని విద్యార్థులకు  నులిపురుగుల మాత్రలను వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాలలో గురువారం నట్టల నివారణ కొరకై నులి పురుగుల మాత్రలను ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తీసుకురాగా  మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొని విద్యార్థులకు వేశారు. హాజరుకాని విద్యార్థులకు మరో రోజు నూలు పురుగుల మాత్రలు వేయడం జరుగుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంజలి, విద్యా వాలెంటరు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.