బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
గంభీరావుపేట, ముద్ర: తొమ్మిదేళ్ల మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని యువకులు బీజేపీలో చేరారు. వారికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్ బీజీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాన మంత్రిగా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన యువకులు మోదీ ప్రభుత్వ పథకాలకు, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీ ఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యమని,దాని కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుండే అధికార బీఆర్ఎస్ ఆరాచకాలను ఎండగట్టడమే కాకుండా మోదీ పథకాలను ఇంటింటికి వివరించాలన్నారు.పార్టీ కోసం పని చేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.