రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతం చేయండి- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్
![రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతం చేయండి- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6404312f3f353.jpg)
ముద్ర, వేములవాడ: వేములవాడలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 9:30 నిమిషమునకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామీ వారి దర్శనం,అనంతరం ఉదయం 10:30 కు నిమిషమునకు కథలాపుర్ మండలం కలికోట లోని అసంపూర్తిగా మిగిలి పోయిన కళికోట ప్రాజెక్ట్ సందర్శన చేయడం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.వేములవాడలో సాయంత్రం 4.30 నిమిషమునకు సంకేపళ్లి, రుద్రవరం నుండి రాజన్న ఆలయం వరకు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, రాత్రి 7:15 నిమిషమునకు వేములవాడ లో నీ పాత ఆంధ్ర బ్యాక్ వద్ద కార్నల్ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టి పాదయాత్ర కార్యక్రమాలకు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.