ఫ్లెక్సీలను చించి వేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ

ఫ్లెక్సీలను చించి వేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పధిర  బస్టాండ్ లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపడం  అవివేకమైన చర్య అని అన్నారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను మరొక పార్టీకి చెందిన వ్యక్తులు వ్యక్తులు చించి వేయడం అన్యాయమన్నారు. ఈ చించివేతపై పోలీసులకు తాము ఫిర్యాదు చేస్తున్నామని నిందితులను పట్టుకొని శిక్షించినట్లయితే మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. పదిర గ్రామ శాఖ అధ్యక్షుడు  చెరుకు ఎల్లయ్య ,నాయకులు  గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి, కుంబాల సుధాకర్ రెడ్డి, కంచర్ల శ్రీనివాసు లు చించిన ఫ్లెక్సీలను ప్రజలకు చూపెట్టడం జరిగిందన్నారు.