ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద టీవీఎస్ ఎక్సెల్ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లికి చెందిన గుత్తికొండ తిరపతమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ అతివేగమే కారణమని , అధికారులు ఈ అక్రమ ఇసుక రవాణా పట్టించుకోలేకపోవడంతో తరుచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు.