తీగల వంతెన పై షూటింగ్

తీగల వంతెన పై షూటింగ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయింది. ప్రముఖ దర్శకుడు మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమవుతున్న కామిడీ ఓరియంటెడ్ చిత్రం తీగల వంతెన పై హీరో హీరోయిన్ల పై పాటను చిత్రీకరిస్తున్నారు. గతంలో తెలంగాణ యాసను భాషను సమైక్య పాలకులు  అవమానించి, వ్యాంగంగా మాట్లాడే వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వారి ప్రతిభ  వెలుగులోకి వచ్చింది.

ఇపుడు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ యాస భాష ఉంటేనే పెద్ద హిట్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తెలంగాణ  కళాకారులకు  డిమాండ్ పెరిదింది. ఈ చిత్రంలో హీరోగా కమెడియన్ సత్యం రాజేష్ హీరోయిన్లుగా సునీత , రియా నటిస్తున్నారు.