కల్తీ పాల వ్యాపారి అరెస్ట్

కల్తీ పాల వ్యాపారి అరెస్ట్

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా జోరుగా కొనసాగుతుంది. కాసులకు కక్కుర్తి పడి పాలలో విష పదార్థాలు కలిపి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారి సన్న ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 60 లీటర్ల కల్తీ పాలు, 250 ఎమ్ ఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్,8 కేజీల డోలోపర్ స్కీమ్డ్ పాల పౌడర్ ప్యాకెట్లను భువనగిరి ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.