అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

భూదాన్ పోచంపల్లి, ముద్ర;రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి హైట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఆయా వార్డులలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కెసిఆర్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, కెసిఆర్ ను హైట్రిక్ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ,కౌన్సిలర్లు కొంగరి కృష్ణ, పెద్దల చక్రపాణి, గుండు మధు, సామల మల్లారెడ్డి ,దేవరాయ కుమార్, కర్నాటి రవీందర్, కుడికాల ఆకుల బలరాం, నాయకులు తడక రమేష్, దోర్నాల గణేష్, కొట్టం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.