పైళ్ళ శేకర్ రెడ్డి గెలుపు కై ఏ.జే.ఆర్ పాదయాత్ర

పైళ్ళ శేకర్ రెడ్డి గెలుపు కై ఏ.జే.ఆర్ పాదయాత్ర

వలిగొండ (ముద్ర న్యూస్) :  భువనగిరి నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధి పైళ్ళ శేకర్ రెడ్డి గెలుపు కై వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామం నుండి వెంకటాపురం పరిది లో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వేముల కొండపైకి పాదయాత్రగా పహిల్వాన్  పురం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక వేత్త, బి.ఆర్.ఎస్ పార్టీ  జిల్లా నాయకులు ఎలిమినేట్ జంగా రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సదర్భంగా ఏ.జే.ఆర్ మాట్లాడుతూ భువనగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే పైళ్ళ శేకర్ రెడ్డి నిస్వార్డంతో అభివృద్ధి పరిచారు. పైళ్ళ శేకర్ రెడ్డి  రానున్న ఎన్నికలలో వలిగొండ బు మండలం ఎక్కువ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పహిల్వాన్  పురం గ్రామ సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, పోలేపాక బక్షపతి, వివిధ గ్రామాల సర్పంచ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.