బిజెపి. కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరిక....

బిజెపి. కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరిక....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండలంలో గల బేగంపేట గ్రామానికి చెందిన బిజెపి. కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది శుక్రవారం నాడు ఆలేరు శాసనసభ అభ్యర్థి గొంగిడి సునీత. గుమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిటీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన 50 మంది వివిధ రాజకీయ పార్టీల నుండి చేరారు. బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన 100 మంది వారి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.