భువనగిరి కలెక్టరేట్ లో దారుణం

భువనగిరి కలెక్టరేట్ లో దారుణం
  • ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు 
  • ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి కలెక్టరేట్ లో శుక్రవారం దారుణం జరిగింది. ప్రియుడిపై కత్తితో ప్రియురాలు దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ శాఖలో శిల్ప, మనోజ్ పనిచేస్తున్నారు. శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012 వివాహం జరిగింది. ఒక బాబు ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటు మనోజ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తుంది. మనోజ్ యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓ పని చేస్తున్నారు. రెండు నెలల నుంచి మనోజ్ లీవ్ పెట్టి వెళ్లాడు. శిల్పను కలవకుండా తిరుగుతూ తన సెలవులను పొడిగించుకునేందుకు శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వచ్చాడు. మనోజ్ వచ్చిన  సమాచారం తెలుసుకొని శిల్పా కలెక్టరేట్ కి వచ్చి మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో మనోజ్ కత్తితో దాడి చేయబోగా శిల్పా ఆ దాడిని అడ్డుకొని అదే కత్తితో మనోజ్ పైన దాడి చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మనోజ్ నీ అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.