రామన్నపేటలో ఘనంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
![రామన్నపేటలో ఘనంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6410663f1f94a.jpg)
రామన్నపేట ముద్ర న్యూస్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్,(ఐలు) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐలు 1982 మార్చి 13 న ఆవిర్భవించి 42సంవత్సరాలు గడుస్తున్నాయని ఆవిర్భవించిన నాటినుంచి నేటి వరకు న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం, న్యాయవాదుల రక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు సాధించడం జరిగిందని ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి అన్నారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని,కొత్తగా న్యాయవాద వృత్తి లోకి వచ్చినటువంటి న్యాయవాదులకు పదివేలు స్టాఫ్ అండ్ ఇవ్వాలని, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వివిధ కోర్టు ల లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఐలు ను స్థాపించిన వ్యవస్తపాకుల జెస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, హెచ్ ఆర్ ఖన్నా, ఎసి గుప్తా, పిఎస్ పాతి ల పోస్టర్ ను రామన్నపేట బార్ ఉపాధ్యక్షుడు ఉయ్యాలహనుమంతు ,సీనియర్ న్యాయవాది అక్కనపల్లి వాసుదేవరావు, దుశర్ల నరేందర్రావు,పోస్టర్ ఆవిష్కరించారు. ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగతయ్య, యాదాసు యాదయ్య, రవీందర్,సత్యనారాయణ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.