లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడి
![లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడి](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_654e5c799fad5.jpg)
హైదరాబాద్: హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, కరీంనగర్ లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయాల నిర్వహణకు సంబంధించిన లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీ టీ డీ) నియమించింది. తనకు లభించిన ఈ అవకాశం పట్ల మోహన్ ముల్లపూడి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలందించే అవకాశాన్ని తనకు కల్పించినందుకు టీటీడీకి ఆయన కృత్ఞతలు తెలిపారు.