లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడి

లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడి

హైదరాబాద్: హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్,  కరీంనగర్ లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయాల నిర్వహణకు సంబంధించిన లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ ఏ సీ) సభ్యుడుగా మోహన్ ముళ్ల పూడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీ టీ డీ) నియమించింది. తనకు లభించిన ఈ అవకాశం పట్ల మోహన్ ముల్లపూడి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలందించే అవకాశాన్ని తనకు కల్పించినందుకు టీటీడీకి ఆయన కృత్ఞతలు తెలిపారు.