సీనియర్ జర్నలిస్టు మారేమండ సీతారామయ్య కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు మారేమండ సీతారామయ్య కన్నుమూత
Senior journalist Maremanda Seetharamaiah passed away

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, రచయిత మారేమండ సీతారామయ్య మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్ళు. 1974లో ఈనాడులో సబ్ ఎడిటర్ గా పాత్రికేయ జీవితం ప్రారంభించిన సీతారామయ్య ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలలోనూ,  ఆంధ్రభూమి, ఆదివారం వారపత్రికల్లోనూ పనిచేశారు. 

1988 -98 మధ్య స్టాక్ మార్కెట్ వార్తలు, స్టాక్ కొటేషన్లకు పత్రికలు పూర్తి పేజీ కేటాయిస్తున్న రోజులలో మారేమండ స్టాక్ మార్కెట్ స్పెషలిస్ట్ గా బాగా రాణించారు. సీతారామయ్య మృతి పట్ల వివిధ పత్రికలలో పనిచేస్తున్న ఆయన సహచరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.