దైవచింతనతో అన్ని సాధ్యం: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
![దైవచింతనతో అన్ని సాధ్యం: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ee5ce29b7c1.jpg)
భువనగిరి ముద్ర ప్రతినిధి: దైవచింతనతో అన్ని సాధ్యమవుతాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డు శ్రీరామ్ నగర్ లో నూతనంగా నిర్మించిన గోవింద క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర శ్రీ భూవరహ సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ మహా కుంభాభిషేకము కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ గోపురం, మంటపాదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతన తో మనసుకు ప్రశాంతత ఏర్పడి ఏదైనా సాధించగలరన్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం జరిపారు. ఆలయంలో యజ్ఞ, హోమ కార్యక్రమాలు పండితులు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, కౌన్సిలర్ చెన్నస్వాతి, చెన్న మహేష్, రాచమల్ల రమేష్ ,గాదె శ్రీనివాస్, బెలిదే వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.