కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వార్తలు వాస్తవమే: చింతల వెంకటేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వార్తలు వాస్తవమే: చింతల వెంకటేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం మండలంలోని వడపర్తి గ్రామంలో సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి నిర్వహించిన ఎల్లమ్మ పండుగ లో చింతల పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల విషయంలో తాను కాంగ్రెస్ పార్టీ అధినాయకులు తనతో మాట్లాడిన విషయం వాస్తవమేనన్నారు. భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని తన ఆశయమని తెలియజేశారు. గత తొమ్మిది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తన సేవలను ఉపయోగించు కోలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సంప్రదించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలియజేశారు.