హోటల్ పై కస్మిక దాడి
![హోటల్ పై కస్మిక దాడి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64bfeeec78e98.jpg)
భువనగిరి జూలై 25 (ముద్ర న్యూస్) భువనగిరి పట్టణం లోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి మంగళవారం ఆకస్మికంగా దాడులు జరిపారు, హోటల్స్ అపరిశుభ్రత గమనించి శుభ్రంగా ఉంచాలని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హేచ్చరించారు.
వారి దగ్గర నుంచి ఆహారంశాంపిల్స్ ను సేకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు, సేకరించిన ఆహారం శాంపుల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రజలకు అందించే ఆహారపదార్థాలు శుభ్రంగాఆరోగ్యవంతంగాఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హేచ్చరించారు.