స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రాణ స్నేహితులు

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రాణ స్నేహితులు

ముద్ర, తుర్కపల్లి న్యూస్ :అనారోగ్యంతో మృతి చెందిన  స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రాణస్నేహితులు. యదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకూ కలిసి చదువుకున్న 1999 బ్యాచ్ పూర్వ విద్యార్ధి
వెంకటాపురం గ్రామానికి చెందిన చేపూరి వెంకటాచారి  అనారోగ్యంతో చనిపోగా పేద కుటుంబానికి చెందిన అతని సంవత్సరికం చేయడానికి కావాల్సిన కర్చుల నిమిత్తం 15000 వేల రూపాయలను మృతి చెందిన స్నేహితుని తల్లి,భార్య పిల్లలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో దత్తాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఎరుకల వెంకటేష్ గౌడ్, మాద మల్లేష్,గుజ్జ లక్ష్మణ్, ఆలేటి ఇస్తారి, పోతరాజు ఇస్తారి , కల్లూరి నరసింహారెడ్డి, గడిపే బాల్ నర్సయ్య, ఎర్రగుంట జనార్ధన్, గుజ్జ కృష్ణ ,ఎండి ఖయ్యూం, కల్లూరి నరసింహారెడ్డి,నాగారం రామదాస్, రాపోలు మాధవరెడ్డి, సునీత ,విజయలక్ష్మి, నిర్మల తదితర పూర్వ విద్యార్ధులు, ప్రాణ స్నేహితులు ఉన్నారు.