కబ్జా భూముల నష్టపరిహారం ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన 

కబ్జా భూముల నష్టపరిహారం ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన 

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రాజెక్టు లో ముంపుకు గురవుతున్న బియన్ తిమ్మాపురం గ్రామస్తులు కబ్జా భూముల నష్టపరిహారం ఇవ్వాలని భూ నిర్వాసితుల నాయకులు వల్దాస్ రాజ్ కాళభైరవ ఆధ్వర్యంలో భువనగిరి తాసిల్దార్ కార్యాలయం  ముందు శుక్రవారం  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వల్దాస్ రాజ్  కాలభైరవ మాట్లాడుతూ కబ్జా భూములు గ్రామం లో దాదాపుగా 180 ఎకరాల భూమి ఉండగా ప్రాజెక్టు కట్ట పూర్తి కావస్తోందని, గతంలో  ప్రభుత్వం కబ్జాలో ఉన్న భూములకు  నష్టపరిహారం చెల్లిస్తాం అని నమ్మించి మోసం చేశారని చెప్పారు. కబ్జా భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వలందాస్ గండయ్య, ఉడుత అమరందర్, జాని, మహేష్, నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.