బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

భూదాన్ పోచంపల్లి, ముద్ర:భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మెహర్ నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోట సురేందర్, శరత్,శ్రీకాంత్,రంజిత్, నవీన్,చందు, సుమంత్, సంతోష్,చందు  చెరికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, బుర్రి రమేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సిర్పంగి వెంకటేష్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలువెరు బాలనర్సింహా,గ్రామ శాఖ అధ్యక్షులు లింగస్వామి,ఉపసర్పంచ్ ఆకుల రాంచందర్,వార్డు మెంబర్ ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.