చక్రతీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

చక్రతీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

భువనగిరి (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి లో  శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన చక్రతీర్థ మహోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఆయన సతీమణి పైళ్ళ వనిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.