ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
![ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_654a4ec8c3659.jpg)
ముద్ర ప్రతినిధి ,భువనగిరి :ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరికీ ఏలాంటి సమస్యలున్న పరిష్కరిస్తామన్నారు. పేద ఆర్యవైశ్యుల అందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఖాళీ స్థలం ఇప్పిస్తానని తెలిపారు. ఆర్యవైశ్యులందరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.