సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలి..
- పేద ప్రజల అభివృద్ధి బాటగా కెసిఆర్ మేనిఫెస్టో...
- భారీ మెజార్టీతో శేఖర్ రెడ్డిని
- గెలిపించుకోవాలి : టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి
ముద్ర ప్రతినిధి భువనగిరి :నేడు భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పింఛన్ల పెంపుదల, ఆరోగ్యశ్రీ బీమా 15 లక్షలకు పెంచడం, అమ్మాయిలకు బస్సు పాస్ సౌకర్యం, సౌభాగ్య లక్ష్మి పేరుతో మహిళలకు భృతి అందజేయనున్నట్లు చెప్పారు. భువనగిరి నియోజకవర్గాన్ని అద్దంలో తీర్చిదిద్దిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ కొలుపులు అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు పాల్గొన్నారు.