త్యాగానికి ప్రతీక గా బక్రీద్... ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న - ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి..

త్యాగానికి ప్రతీక గా బక్రీద్... ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న - ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి భువనగిరి : అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హాజరత్  ఇబ్రహీం త్యాగానికి ప్రతీక గా జరుపుకునే పండుగ బక్రీద్ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని భువనగిరి పట్టణంలో గల నూతనంగా కేటాయించిన ఈద్గా ప్రాంతంలో  ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అనంతరం ముస్లిం సోదరులతో అలాయ్ బలాయ్ లు తీసుకుంటూ వారికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హాజరత్  ఇబ్రహీం త్యాగానికి ప్రతీక గా జరుపుకునే పండుగ అని ముస్లింలకు కీలకమైన పండుగలల్లో ఒకటని పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరు కలిసి జరుపుకోవడమే బక్రీద్ ముఖ్యఉద్దేశమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో హిందూ ముస్లింలు ఐక్యత గంగా జామున తహజీబ్ నితలపిస్తుందని సీఎం కేసీఆర్ ఎల్లవేళలా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోరుకునే వ్యక్తి అని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ఎండీ. అజీమ్, గోమారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.