క్షతగాత్రున్ని పరామర్శించిన హరిశంకర్ గౌడ్..

క్షతగాత్రున్ని పరామర్శించిన హరిశంకర్ గౌడ్..

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన ఆకుల వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని మేడిపల్లి లో గల కాకతీయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరి శంకర్ గౌడ్ బుధవారం రాత్రి హాస్పిటల్ కి వెళ్లి వెంకటేశును పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు. హాస్పిటల్ వైద్యులను వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్ఆర్పిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతోపాటు వెంకటేష్ కుటుంబ సభ్యులు. బంధుమిత్రులు. తదితరులు పాల్గొన్నారు.