మెదక్ కోదండరామాలయంలో ఎమ్మెల్సీ శేరి దంపతుల పూజలు

మెదక్ కోదండరామాలయంలో ఎమ్మెల్సీ శేరి దంపతుల పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మెదక్ శ్రీ కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీబాష్యం మధుసూదనాచారి, కమిటీ అధ్యక్షులు బండా నరేందర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గా ప్రసాద్, ఆలయ కమిటీ బాద్యులు నగరం మల్లేశం, బద్రి, నందిని శ్రీనివాస్, మాజీ ఎంపిపి అధ్యక్షులు గోపాలరావు, సర్పంచ్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి గంగపురం సిద్ధిరాములు, ఆంధ్ర రాము తదితరులున్నారు.