ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 

ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 
  • బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్.

మోత్కూర్(ముద్ర న్యూస్):నేడు ఉదయం 9 గంటలకు తుంగతుర్తి శాసనసభ్యులు  డా.గాదరి కిశోర్ కుమార్ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఇట్టి కార్యక్రమానికి బిఆర్ఎస్ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని బిఆర్ఎస్  మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ అన్నారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి , బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు హాజరుకానున్నారని తెలిపారు. కావున ఎన్నికల ముమ్మార ప్రచార  ర్యాలీలో భారీ సంఖ్యలో యంపిపి, జెడ్పీటీసీ, యంపిటీసిలు, సర్పంచులు వివిధ గ్రామాల అధ్యక్షకార్యదర్శులు,బూత్ కమిటీల సభ్యులు,ఇంచార్జీలు,యువజన విభాగం నాయకులు, బిఆర్ఎస్వి మండల యువకులు మహిళలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎన్నికల ప్రచార ర్యాలీని విజయవంతం చేయాలని అన్నారు.