మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, బియ్యం అందజేసిన మున్సిపల్ చైర్మన్..

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, బియ్యం అందజేసిన మున్సిపల్ చైర్మన్..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన స్వర్గం సువర్ణ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేనేందర్ గౌడ్ బుధవారం నాడు సువర్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనో ధైర్యం కల్పించి. సువర్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం సువర్ణ కుటుంబ సభ్యులకు బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీసరి బాలరాజు. ఎరుకల హేమేందర్ గౌడ్. స్వర్గం లక్ష్మయ్య. స్వర్గం విజయ్. ఆరే శ్రీకాంత్ తో పాటు సువర్ణ కుటుంబ సభ్యులు. బంధుమిత్రులు. కాలనీ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు......