ఘనంగా నవరాత్రి వేడుకలు

ఘనంగా నవరాత్రి వేడుకలు

జనగామ టౌన్, ముద్ర : జనగామ పట్టణంలోని 14వ వార్డు అంబేద్కర్ నగర్‌‌లో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వి.సుహాసిని, డీసీసీ పి.సీతారాం, ఏసీపీ కె.దేవేందర్‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు వడ్డాలపు రాజేందర్, అన్నం వాసు, రాము, నరేందర్, శ్రీధర్, యువసేన యూత్ కమిటీ సభ్యులు అన్నం సత్యపాల్, జగదీష్, కృష్ణ, వినయ్, డేగల రాజు, సందీప్, అశోక్, శ్రవణ్, హరీశ్, విశాల్, సందీప్, నరేష్, తరుణ్, అజయ్ దీపక్, కార్తీక్, లికిత్ తదితరులు పాల్గొన్నారు.