ప్రజాసేవ కోసం వచ్చా ఆదరించండి

ప్రజాసేవ కోసం వచ్చా ఆదరించండి
  • కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ప్రజాసేవ కోసం వచ్చిన నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి అని కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. మంగళవారం కార్యకర్తలు, నాయకులు అభిమానులు భారీ ర్యాలీగా వెంటరాగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం శివాజీ సెంటర్ లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఓటు హక్కు లేని వాళ్ళు, స్థానికేతరులు కేవలం రాజకీయాల కోసం, పదవుల కోసం ఇక్కడికి వస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా స్థిరపడిన నేను స్థానిక రాలుగా నా ఇంటిని చక్కబెట్టినట్టే నియోజకవర్గాన్ని చక్కబట్టేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో పదవుల్లో ఉన్న కడియం టెక్స్టైల్ పార్క్, లెదర్ పార్క్ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. కామారెడ్డి, గజ్వేల్ లో కెసిఆర్ ఓటమిపాలు చెందితే కడియం శ్రీహరికి ఇది చివరి ఎన్నిక అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కొలిపాక సతీష్, చేపూరి చిరంజీవి, శిరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఊమ్లా నాయక్, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, సింగపురం వెంకటయ్య, నాగయ్య, చెవుల యాదగిరి, కాసాని బొందయ్య, నగరబోయిన శ్రీరాములు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.