ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
  • కాంగ్రెస్ ను నిలదీయండి
  • బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాజకీయ జన్మనిచ్చిన మీరు మరో మారు ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదారిపల్లి, విశ్వనాధపూర్, నమిలిగొండ, పామునూరు, మీదికొండ, రాఘవాపూర్, చాగల్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలతో పాటు ప్రజల అవసరాలను తీర్చే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కెసిఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది అన్నారు. ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ ఇండ్లు మొదలైన పథకాల అమరులు తెలంగాణ దిక్చూచిగా నిలిచిందన్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, నియోజకవర్గంలో ఉన్న అనుబంధం తో గ్రామ గ్రామాన సమస్యల్ని పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మరోమారు ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కల్లబొల్లి మాటల తో ఇంటింటికి ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.

ఎన్నికల ప్రచారంలో చింతకుంట్ల నరేందర్ రెడ్డి, భూర్ల లతాశంకర్, బెలిదె వెంకన్న, ఆకుల కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, గట్టు రమేష్, తోట వెంకన్న, కనకం రమేష్, పల్లె రవీందర్, హనుమాండ్ల మల్లేషం, గుర్రం నర్సింహులు, పురమాని రజాక్ యాదవ్, తాటికొండ సురేష్ కుమార్, పోగుల సారంగపాణి, కోతి రాములు, రాజిరెడ్డి, ఉప్పల స్వామి, లతా శ్రీనివాస్, నగరబోయిన మణెమ్మ యాదగిరి, చంద్రయ్య, పద్మా రెడ్డి, చేపూరి వినోద్, గన్ను నర్సింలు తదితరులు పాల్గొన్నారు.