జనగామ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

జనగామ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

 ముద్ర ప్రతినిధి, జనగామ: నూతనంగా నియామకమైన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్ తో పాటు పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.