లోకేష్ కు నోటీసులు సిగ్గుచేటు

లోకేష్ కు నోటీసులు సిగ్గుచేటు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మోటం శ్రీనివాస్, ఎస్టి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ మోహన్ నాయక్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్ర బాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైలు పెట్టడం, అవినీతికి ఆమడ దూరంలో ఉండే లోకేష్ కు నోటీసులు ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా  ఖండించారు. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో బాబుకు మద్దతు తెలుపుతున్న తీరును వైఎస్ జగన్ గుర్తించి వెంటనే చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి, కలకోట రమేష్, అరుణ్ నాయక్, లాలూ నాయక్ ఉన్నారు.