పల్లాకు ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్న ఆయన యాదాద్రిని దర్శించుకొని నేరుగా జనగామకు చేరుకున్నారు. అప్పటికే పల్లా కోసం జనగామ పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ లీడర్లు ఆయన రాగానే పటాకలు కాల్చి స్వాగతం పలికారు. అనంతరం పల్లా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.